Monday, April 29, 2024

రాజకీయాలకు అతీతంగా… బిజెపి నేతను పరామర్శించిన బాల్క సుమన్

రాజకీయంగా ప్రజా సమస్యలపై పోరాటం వేరు.. సాటి మనుషులుగా ఎవరికైనా ఆపద వస్తే అండగా నిలబడటం వేరు. మానవత్వానికి రాజకీయం ఏనాడు అడ్డం కాదంటూ ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ నిరూపించారు. ఆదివారం అం చెన్నూరు పట్టణంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ జిల్లా కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ స్వగృహానికి బాల్క సుమన్ స్వయంగా వెళ్లి పరామర్శించిన తీరు రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆలోచింపజేసింది.

రాజకీయంగా ఇరుపార్టీల సైద్ధాంతిక సిద్ధాంతాలు వేరు కావచ్చు కానీ మానవత్వానికి అవేమీ అడ్డు కాదంటూ ఆయన క్షేమాన్ని కోరుకోవడం ఎమ్మెల్యే బాల్క సుమన్ మంచి మనసుకు అద్దం పట్టింది. బిజెపి నేతలు ఆప్యాయంగా వెంకన్న ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని బాల్క సుమన్ పరామర్శించడం విశేషం. శాంతియుత రాజకీయాలకు చిరునామాగా చెన్నూరు నియోజకవర్గాన్ని తీర్చి దిద్దుతున్న బాల్క సుమన్ ను ప్రజలు అభినందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement