Monday, April 29, 2024

నిధులు కేటాయించండి.. మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే దాసరి వినతి

పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కోరారు. మంగళవారం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ను కలిశారు. నియోజకవర్గంలోని సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి 29.40 కోట్లు, పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి 125.55 కోట్ల రూపాయలు కేటాయించాలని విన్నవించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement