Saturday, May 25, 2024

Peddapalli: ఆక్యుఫ్రిషర్‌తో సర్వ రోగాలు మాయం

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 20 (ప్రభ న్యూస్‌): ఆక్యుఫ్రిషర్‌తో సర్వ రోగాలు మాయమవుతాయని, చికిత్స కంటే నివారణ ప్రధానమని వైద్యులు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నిట్టూరు రోడ్‌లో గల శ్రీ బాబా రాందేవ్‌, చాముండమాత దేవాలయంలో శ్రీ బాబా రాందేవ్‌ సేవా మండల్‌ ఆధ్వర్యంలో ఆక్యుఫ్రిషర్‌, మ్యాగ్నెటిక్‌ చికిత్స, వైబ్రేసన్‌ చికిత్స, సూజోక్‌ చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్‌ రామ్మనోహర్‌ లోహియా ఆరోగ్య జీవన సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్‌ డీకే. వైష్ణవ్‌, డాక్టర్‌ సురేంద్రసింగ్‌లు చికిత్స అందిస్తున్నారు.

మెడ నొప్పి, తల నొప్పి, కీళ్ల నొప్పులు, కళ్లు, రక్తపోటు, మధుమేహం, అసిడిటి, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, తుంటి నొప్పి, ఆర్ధరైటిస్‌, బ్రాంకైటిస్మై, నిద్రలేమి, థైరాయిడ్‌, చెవి, ముక్కు సంబంధిత సమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్నట్లు వైద్యుల తెలిపారు. చికిత్స కంటే నివారణ ఉత్తమ మార్గమని, శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 19న మొదలైన శిబిరం 25వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈకార్యక్రమంలో శ్రీ బాబా రాందేవ్‌ సేవా మండల్‌ సభ్యులు దిలీప్, ప్రవీణ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement