Tuesday, April 30, 2024

మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. రక్తదానం చేసిన కలెక్టర్ దంపతులు

ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసేందుకు పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సోమవారం ఉదయం నుండే సబ్ డివిజన్ పరిధిలోని 6006 మంది యువతీ యువకులు శిబిరానికి హాజరై రక్తదానం చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి స్వయంగా వారికి సర్టిఫికెట్లతో పాటు పండ్లు పంపిణీ చేశారు.

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ దంపతులు శిబిరానికి హాజరై రక్తదానం చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రక్తదానం చేసిన యువతీ యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ఎడ్ల మహేష్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐలు అనిల్, జగదీష్, ఎస్ఐ మహేందర్ తో పాటు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement