Sunday, May 12, 2024

భార్య‌ను దారుణంగా హ‌త‌మార్చిన భర్త

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీష (30)ను భర్త ప్రవీణ్ కత్తితో పొడిచి చంపడం జరిగింది. శిరీష అంగన్వాడి సెంటర్ లో ఆయమ్మగా పనిచేస్తుంది. జాతీయ జెండా ఎత్తిన అనంతరం భర్త శిరీషను అంగన్వాడి సెంటర్ నుండి లాక్కెళ్లి కత్తితో పొడిచి చంపి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. విష‌యం తెలుసుకున్న తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ దాస సుధాకర్ ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement