Thursday, May 16, 2024

Peddapalli : అన్ని వర్గాలకు పెద్ద పీట.. ఎమ్మెల్యే దాసరి

రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లిలో యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 10లక్షల రూపాయల మంజూరీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అనేక నిధులు వెచ్చించి వెనుకబడిన తరగతుల వారి అభ్యున్నతికై బీసీ, ఎస్సీ, ఎస్టిలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తూ వారికి పెద్దపీట వేస్తున్నారన్నారు.


నిర్మాణాలకే పరిమితం చేయకుండా సద్వినియోగం చేసుకొని వివిధ కుల సంఘాలు అభివృద్ధి చెందాలన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు పల్లె గ్రామ ఎంపీటీసీ సభ్యులు పల్లె ప్రసాద్, నాయకులు కంది చొక్కారెడ్డి, బడుగు ఈశ్వర్, దుగ్యాల వెంకట్రావు, మంద స్వామి, మల్లెత్తుల రాజయ్య, రేషవేణీ సతీష్, రేషవేణి మల్లయ్య, కొమ్మ మల్లేష్, కొమ్మ భూమయ్య, కొమ్మ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement