Friday, May 3, 2024

బాధిత కుటుంబానికి రూ. 15లక్షల చెక్కు..

రామగిరి: ఆర్జీ3 ఏరియా పరిధిలోని ఓసీపీ2లో ఈపీ ఆపరేటర్‌గా పని చేస్తూ గత ఏడాది కరోనాతో మృతిచెందిన సీతం దయాసాగర్‌ కుటుంబానికి రూ. 15లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు మంజూరైంది. ఆర్జీ3 జీఎం మనోహర్‌ దయాసాగర్‌ సతీమణి రజనీకి చెక్కును పంపిణీ చేశారు. అలాగే డిపెండెంట్‌ ఉద్యోగం కింద రజనీకి గతంలో నియామక ఉత్తర్వులు కూడా అందించారు. కరోనా నియంత్రణ చర్యలతోపాటు ఉద్యోగుల కుటుంబాలను యాజమాన్యం ఆదుకుంటుందన్నారు. ఈకార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య, అధికారులు రఘుపతి, శ్రీనివాసులు, నరేందర్‌, రఘుకుమార్‌, విలాస్‌ శ్రీనివాస్‌, రవీందర్‌రెడ్డి, మురళీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement