Saturday, May 4, 2024

రామకోటి స్థూపం నిర్మాణానికి క‌విత భూమి పూజ‌…

జగిత్యాల – కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ఆలయ ఉత్తర ద్వారం ఎదుట రూ.90లక్షల వ్యయంతో నిర్మించనున్న రామకోటి స్థూపం నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మంగళవారం భూమిపూజ చేశారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి ఐకేరెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, సంజయ్‌కుమార్‌కు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే రవిశంకర్, సంజయ్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement