Friday, April 26, 2024

నాడు తండ్రి.. నేడు తల్లి మృతి – అనాధలైన చిన్నారులు

ఎల్లారెడ్డిపేట: అనారోగ్యంతో తల్లిదండ్రులు, తాత మృతిచెందడంతో చిన్నారులు అనాధలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన మామిండ్ల రాజు, భాగ్య ఇరువురు మృతిచెందారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతిచెందడంతో చిన్నారులు అశ్విని, నిహాల్‌ బోరున విలపించడం గ్రామస్తులను కన్నీరు పెట్టించింది. తల్లిదండ్రులతోపాటు తాత కూడా మృతిచెందడంతో అశ్విని (14), నిహాల్‌ (5)లు అనాధలయ్యారు. వెంకటాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్లో అశ్విని ఎనిమిదో తరగతి చదువుతుంది. వీరిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు ఫోన్‌ పే ,గూగుల్‌ పే 8978802608 నంబరుకు పంపించాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement