Saturday, May 4, 2024

KA-Paul: కేసీఆర్ ను పరామర్శించిన కేఏ పాల్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు, కేసీఆర్ ను ఉద్దేశించి రెండు రోజుల క్రితం కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న అధికారులెవ్వరూ దేశం విడిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులపాలు కావడానికి కేసీఆర్ అండ్ కో కారణమని చెప్పారు. రాష్ట్ర అప్పులపై విచారణ జరిపించాలని… అంత వరకు వీరిని దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement