Sunday, April 28, 2024

TS : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు తీర్పును రిజర్వ్ చేసింది.

- Advertisement -

ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసిన కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement