Friday, May 17, 2024

Joinings – బోయపల్లిలో పలువురు బిఆర్ఎస్ లో చేరిక…

పాండు అక్టోబర్ 27 (ప్రభన్యూస్) – తాండూర్ మండలం బోయపల్లి గ్రామంలో శుక్రవారం పలువురు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సిపిఐ కి చెందిన పలువురు పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కండువాలు కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మసాడి శ్రీదేవి, సర్పంచ్ భీమ సునీత ,ఉపసర్పంచ్ వెంకటేశం, నాయకులు మసా డి తిరుపతి ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement