Thursday, May 2, 2024

Bellampalli – రైతు వ్యతిరేక, ద్రోహి పార్టీ కాంగ్రెస్… ఎంపి వెంక‌టేష్ నేత

బెల్లంపల్లి, అక్టోబర్ 27, (ప్రభ న్యూస్) – రైతు వ్యతిరేక పార్టీ, రైతు ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బెల్లంపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో బ్రష్టు పట్టిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చతిస్గడ్, , కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అక్కడి ప్రజలను మోసం చేశారని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేయడానికి ఇక్కడ కూడా ఆచరణకు సాధ్యం కానీ హామీలు మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. స్థానికేతరుడు కానీ గడ్డం వినోద్ డబ్బుల సంచులతో ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాడని, అతని మోసాలను ప్రజలు నమ్మొద్దని అన్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వినోద్ ఇక్కడ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ పుస్కూరి రామ్మోహన్ రావు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ దొంగల సత్యనారాయణ , మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పిటిసిలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement