Sunday, April 28, 2024

Join – బిఆర్ఎస్ పార్టీలో చేరిన గట్టు రామ‌చంద్రరావు, ఇత‌ర వైఎస్సార్‌టీపీ కీల‌క నేత‌లు …

హైదరాబాద్‌ : వైఎస్సార్‌టీపీ పార్టీ నుంచి పలువురు నేతలు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గట్టు రాంచందర్ రావు అధ్వర్యంలో బీఆర్‌ఎస్ లో చేరారు. వైఎస్సార్‌టీపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు స్వాగతం తెలిపారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గట్టు రాంచందర్ రావును పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయట్లేదని.. కాంగ్రెస్‌ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. నమ్మివస్తే తమను నట్టేట ముంచిన షర్మిలపై ఆగ్రహం రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. ఇదే విష‌యాన్ని హరీష్ రావుకు తెలిపారు.సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తాము భావించి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు

ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ,

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా పార్టీ నడపగలుగుతారా తెలంగాణ వాళ్లకు అంత సీను ఉందా అనే అవహేళన మాటలు ఎన్నో విన్నాము. ఇలాంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ .. సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదు అని అవహేళన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీకటి మయమైతుందని చెప్పారు. ఆయనలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే లాగా ఈరోజు రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపాడు మన కెసిఆర్.. తెలంగాణ పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుని అమలు చేసేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ . తండ్రి సమానులైన కేసీఆర్ గారిని రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈరోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్తున్న కర్ణాటక మోడల్ ప్రజలకు అర్థమైంది అని పేర్కొన్నారు.

- Advertisement -

కర్ణాటకలో రైతులు రోడ్డు మీదకు వచ్చారు. మూడు గంటల కరెంటు ఇచ్చి రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ మోడల్ తెలంగాణలో పనికిరాదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తోక ముడ్చుకుంది. రైతులకు ఇస్తున్న రైతుబంధు దండగ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవహేళన చేసేలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని కూడా అవహేళన చేసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణ అమరవీరులను అవహేళన చేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. సీమాంధ్ర నాయకుల సూట్కేసులు మోయడానికి అలవాటు పడ్డ వెన్నెముక లేని నాయకులు తెలంగాణని సమైక్య పాలకుల పాదాల దగ్గర పెట్టుతారు. ఈరోజు కాంగ్రెస్ పాలిస్తున కర్ణాటక రాష్ట్రానికి బియ్యం కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని అడుగుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ చేసింది ఏం లేదు. ఈరోజు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను మార్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ పార్టీకి 50 పైన స్థానాల్లో అభ్యర్థులు లేని పరిస్థితి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్. వ్యవసాయం గురించి తెలవని రేవంత్ రెడ్డికి ఎంత హార్స్ పవర్ మోటర్ రైతులు ఉపయోగిస్తారో కూడా తెలియదు. 10 HP మోటర్ పెట్టి మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలు అని చెప్పే అవగాహన లేని అధ్యక్షుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి రైతులకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వైఎస్ఆర్ టిపి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరుకుంటున్నాను. -YSRTP లో ఎదుర్కొన్న సూటిపోటి మాటలు అవహేళనలు బీఆర్ఎస్ పార్టీలో ఉండవు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి మరోసారి పార్టీ విజయానికి తోడు పడదాం. మీ అందరికీ మరోసారి పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు అంటూ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు హరీష్ రావు

Advertisement

తాజా వార్తలు

Advertisement