Monday, April 29, 2024

AP: మళ్లీ ముంచిన మున్నేరు.. ఈతకెళ్లి ఐదుగురు గల్లంతు.. ముగ్గురు మృతి

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : మున్నేరు వాగు మరోసారి బలి తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం కీసర వద్ద మున్నేరు వాగులోకి ఈత కోసం దిగి ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా.. ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర మున్నేటి వద్ద సరదాగా ఈత కొట్టేందుకు వచ్చి నీళ్లలోకి దిగిన వ్యక్తులు లోతు గుర్తించక ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమీపంలోని స్నేహితులు చూసి కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న స్థానికులు రక్షించేందుకు ప్రయత్నం చేశారు. మున్నేటి నుండి ఐదుగురు వ్యక్తులను స్థానికులు అతి కష్టమ్మీద బయటకు తీశారు. వీరిలో ముగ్గురు వ్యక్తులు అప్పటికే మృతిచెందగా.. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement