Tuesday, April 30, 2024

Big Breaking | జనగామ లొల్లి ముగిసింది.. కేటీఆర్​ సమక్షంలో చేతులు కలిపిన ముత్తిరెడ్డి, పల్లా!

బీఆర్​ఎస్​ పార్టీలో జనగామ పంచాయితీ కొలిక్కి వచ్చింది. మంత్రి కేటీఆర్​ సారధ్యంలో అక్కడి నేతలు ఒక్కటయ్యారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి చేతులు కలిపారు. కాగా, అసంతృప్తి నేతలకు బాధ్యతలు, ఎన్నికల పనులను అధిష్టానం అప్పగించింది. దీంతో జనగామ బీఆర్​ఎస్​ టికెట్​ పల్లా రాజేశ్వరరెడ్డికి ఖాయం చేయగా.. ఆయన గెలుపుకోసం పూర్తిగా సపోర్టు చేస్తానని ముత్తిరెడ్డి అన్నారు. దీంతో జనగామ టికెట్​ విషయంలో ఉన్న సందిగ్ధం తొలిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement