Tuesday, May 7, 2024

యూజీసీ చైర్మన్ గా తెలంగాణ వాసి జగదీష్ కుమార్

యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ గా తెలంగాణాకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ను నియమిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్ గా జగదీష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. యూజీసీ చైర్మన్ గా ఐదు సంవత్సరాలు కొనసాగుతారని కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. ఇంటిపేరు ఊరుపేరు ఒక్కటే కావడం యాదృచ్చికం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement