Monday, April 29, 2024

Big Story | ఇంటర్నల్‌ షెడ్యూల్‌ ఫిక్స్‌?.. డిసెంబర్‌ మొదటి వారంలోనే సార్వత్రిక ఎన్నికలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ దాదాపు ఖరారైంది. ప్రకటించడమే తరువాయి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అందరూ ఊహించినట్లుగానే డిసెంబర్‌ మొదటివారంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీకి అస్త్ర, శస్త్రాలతో సంసిద్ధమైన రాజకీయ పార్టీలు ఇక ప్రజా క్షేత్రంలో తేల్చుకునే సమయం ఆసన్నమౖౖెంది. అదే సమయంలో సాథ్యమైనంత త్వరలోనే షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా కేంద్ర బృందాలను పంపించి సర్వే నిర్వహించిన ఈసీ ఎన్నికల నిర్వహణకు సంకేతాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి క్షేత్ర స్థాయిలో అన్ని రకాల వనరులను సంసిద్ధం చేసుకున్నారు.

అధికార యంత్రాంగానికి బాద్యతలు అప్పజెప్పడం మొదలుకుని పోలింగ్‌ బూత్‌ స్థాయిలో సిబ్బందికి శిక్షణ వరకు అంతర్గతంగా అన్నీ జరిగిపోయాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఢిల్లి నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో జిల్లా ఎన్నికల అధికారులతో (డీఈవో) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) నిరంతరం సమీక్షలు, సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ రాజకీయ పార్టీలతో భేటీలు పూర్తయ్యాయి.

జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మాత్రం విడిగానే ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టంగానే కనిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌ 7న జరుగనున్నట్లు- తెలుస్తోంది. దీనికి సంబంధించి నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించి 19న నామినేసన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉససంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నవంబర్‌ 22న అభ్యర్థుల తుది జాబితా (ఫారం-7ఏ) ప్రకటించనున్నారు. డిసెంబర్‌ 11న ఓట్లు- లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తాత్కాలిక ఎన్నికల షెడ్యూల్‌ రూపొందించింది.

- Advertisement -

దీనిని అనుసరించే ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ కార్యక్రమాలకు గడువు కూడా నిర్ధేశించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్లెnక్సీని ముద్రించి కార్యాలయ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచారు. 2018లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ సైతం ఇదే కావడం గమనించాల్సిన విషయం. అయితే కొన్ని రోజులు అటు- ఇటు-గా ఇదే షెడ్యూల్‌తో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

నిజానికి తెలంగాణ సహా ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అక్టోబర్‌ మొదటివారం లేదా ఆ తర్వాత ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ షెడ్యూల్‌ ప్రకటించే ఛాన్స్‌ ఉంంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో ఎలక్షన్‌ కమిషనర్లు అనూప్‌ చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌ తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం ఫులు బెంచ్‌ అక్టోబర్‌ 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ తర్వాత వాస్తవ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారు. నిర్దిష్ట తేదీలు, నిర్దిష్ట గడువులతో వచ్చే అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు రోజు వారీగా చేయాల్సిన కార్యక్రమాలతో ఎన్నికల సంఘం క్యాలండర్‌ రూపొందించింది.

ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు ప్రథమ స్థాయి తనిఖీలు పూర్తయ్యాయి. ఎన్నికల సామాగ్రి సమీకరణ, బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు ప్రింటింగ్‌ ప్రెస్‌ ఎంపిక, స్ట్రాంగ్‌ రూమ్స్‌, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన లేదా నిర్ధారణ, దర్యాప్తు సంస్థల నోడల్‌ అధికారులు లేదా సహాయ వ్యయ పరిశీలకులు, లేదా వ్యయ పర్యవేక్షణ బృందాలు లేదా రిటర్నింగ్‌ అధికారులు లేదా సెక్టార్‌ అధికారులకు వేర్వేరుగా శిక్షణ, జిల్లాలకు నిధుల కేటాయింపు, అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన ధరల ఖరారు, ్లపయింగ్‌ స్క్వాడ్స్‌ లేదా స్టాటిక్‌ సర్వేలియన్స్‌ టీ-మ్స్‌ లేదా వీడియో సర్వేలియన్స్‌ టీ-మ్‌ల ఏర్పాటు- తదితర పనులన్నీ వచ్చే అక్టోబర్‌ నెలలోగా పూర్తి చేయాలని సీఈఓ కార్యాలయం నిర్ధేశించుకుంది.

నవంబర్‌లో వివిధ స్థాయిల్లోని అధికారులకు శిక్షణ, పోలింగ్‌ సిబ్బందికి నియామక ఆదేశాల జారీ, సోషల్‌ మీడియాపై పర్యవేక్షణ, ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్‌, వ్యయ పరిశీలకులకు శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల ప్రకటన, వికలాంగులు లేదా 80 ఏళ్లకు పైబడిన వయోవృద్ధులైన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు- హక్కు కల్పించడానికి ఫారం 12డీ దరఖాస్తుల స్వీకరణ, సీ-విజిల్‌ ద్వారా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన ఫిర్యాదుల స్వీకరణ, పెయిడ్‌ వార్తలపై సమీక్ష, ఎన్నికల్లో వినియోగించేందుకు సమీకృత ఓటర్ల జాబితా ప్రకటన ఉంటు-ంది. పోలింగ్‌ లేదా కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ, ఈవీఎంలకు రెండో ర్యాండమైజేషన్‌ నిర్వహణ, పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ లేదా స్వీకరణ తదితరాలన్నీ పూర్తి చేయాలి.

డిసెంబర్‌ నెలలో పోలింగ్‌ సిబ్బందికి తుది శిక్షణ, పోలింగ్‌ కేంద్రాలకు రవాణా సదుపాయ కల్పన, పోలింగ్‌ కు 48 గంటల ముందు మద్యం అమ్మకాలపై నిషేదం, పోలింగ్‌ , కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు- పూర్తి చేయాలి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు అయింది. అక్టోబర్‌ 3 నుంచి మూడు రోజులపాటు- ఈసీ బృందం తెలంగాణలో పర్యటించనుంది. అక్టోబర్‌ 4న అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ- కానుంది. అక్టోబర్‌ 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం కానుంది. ఈవీఎంల నిర్వహణపై ఈసీఐఎల్‌ అధికారులతో ఈసీ బృందం భేటీ- కానుంది. అక్టోబర్‌ 6న తెలంగాణ ఎన్నికలపై నివేదిక ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కనిపిిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement