Friday, May 17, 2024

తెలంగాణ కొత్త స‌చివాల‌యంలో.. సీఎం కేసీఆర్ సుద‌ర్శ‌న‌యాగం

ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త స‌చివాల‌యం ప్రారంభం కానుంది. కాగా ప్రారంభోత్సవం రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. దీని ప్రకారం ఏప్రిల్ 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంట 20 నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి చేస్తారు. ఆ వెంటనే కొత్త సచివాలయాన్ని కేసీఆర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించి నేరుగా 6 వ అంతస్తులోని తన ఛాంబర్ లో కొలువు తీరనున్నారు. మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో సుముహర్తం ఉండటంతో మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తమకు కేటాయించిన చాంబర్లలో కొలువుదీరుతారు. ఈ ఆరు నిమిషాల సమయంలో ఒక ఫైల్ మీద సంతకం చేయాలని అధికారులకు, మంత్రులకు జీఏడీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

అనంతరం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో మంత్రులు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. మరోవైపు నూతన సచివాలయంలో ఆయా శాఖలకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ చాంబర్లను కేటాయించింది. ఏ అంతస్తులో ఏ శాఖ ఉండాలో నిర్ణయించింది. ఒక్కో అంతస్తును మూడు, నాలుగు శాఖలను కేటాయించింది. ఆరో అంతస్తులో సీఎం, సీఎంఓ,సీఎస్ కార్యాలయం ఉండనుంది.మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్..కాగా గ్యాదరింగ్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్.ఆ తరవాత తమతమ స్థానాల్లో కొలువుదీరనుంది అధికారగణం, ఇతర ప్రభుత్వ యంత్రాంగం.ఏప్రిల్ 30 వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న సమీకృత కొత్త పరిపాలనా సౌధం..ఆ రోజు నుంచి అక్కడే పూర్తిస్థాయి విధులు నిర్వర్తించనున్నారు సీఎం, సీఎంఓ అధికార యంత్రాంగం, మంత్రులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement