Sunday, May 5, 2024

Student Missing : ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి మిస్సింగ్

సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ రెండో ఏడాది చదువుతున్న కార్తిక్‌(21) అదృశ్యమయ్యాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన విద్యార్థి తిరిగి క్యాంపస్‌కు రాలేదు. కార్తిక్‌ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఈనెల 19న క్యాంపస్‌కు వెళ్లి ఆరా తీశారు. అక్కడా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా కార్తిక్‌ విశాఖ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులను తీసుకుని అక్కడికి వెళ్లారు. విద్యార్థి స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండా.

Advertisement

తాజా వార్తలు

Advertisement