Wednesday, May 1, 2024

TS | రౌడీయిజం చేస్తే తాటతీస్తా.. నా అనుచరులైనా సహించను: మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

సూర్యాపేట (ప్ర‌భ‌న్యూస్‌) : ‘‘సూర్యాపేటలో ఎవడయినా రౌడీయిజం చేస్తే తాట తీస్తా’’ అంటూ హెచ్చరించారు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. పరాయి వాళ్ల భూములు అక్రమిస్తే నా అనుచరులైనా సహించేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎవడైనా జైలుకే అని వార్నింగ్ ఇచ్చారు. ఇవి పాత రోజులు కావనీ… అన్యాయంపై తిరగబడే రోజులనీ గుర్తుచేశారు.

తొమ్మిదిన్నర ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందనీ, భూ కబ్జాదారులకు మంత్రి జగదీష్ రెడ్డి సుతి మెత్తని కౌంటరిచ్చారు.. నిన్న (ఆదివారం) జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు అక్రమణదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement