Saturday, May 18, 2024

Sangareddy | సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కుతినేవాడు.. వీహెచ్ సీరియ‌స్ కామెంట్స్‌

కాంగ్రెస్ పార్టీ పేద‌ల కోస‌మే పుట్టింద‌ని, సోనియా గాంధీ క‌నుకు లేకుంటే తెలంగాణ వ‌చ్చేది కాద‌న్నారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హ‌నుమంత‌రావు. ఒక‌వేళ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వ‌కుంటే నాంప‌ల్లి ద‌ర్గా ద‌గ్గ‌ర కేసీఆర్ అల్లాకే బాబా దేదో అని అడుక్కుతినేవాడ‌ని సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో, (ప్ర‌భన్యూస్‌): బీసీ లకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేన‌ని, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హ‌నుమంత‌రావు అన్నారు. ఇవ్వాల (బుధ‌వారం) సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల (బీసీ ఐక్య వేదిక) ఓబీసి భేటీ జరిగింది. సంగారెడ్డి డీసీసీ చీఫ్‌ నిర్మల గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మాజీ ఎంపీ, సీనియర్​ కాంగ్రెస్​ నేత వి.హనుమంత రావు పాల్గొని మాట్లాడారు. జనాభా ప్రతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని పార్టీ ముఖ్య నేత‌ రాహుల్ గాంధీ చెప్పారని, దింతో బీజేపీ వెన్నులో వణుకుపుట్టిందన్నారు వీహెచ్‌.

కులాల పేరుతో మనం కొట్టుకోకుండా ఐక్యంగా ఉండాలని, మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలన్నారు. పేదల గురించి ఆలోచించేది ఒక్క గాంధీ కుటుంబం మాత్ర‌మేన‌ని, పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గారిబీ హటావో అనే నినాదంతో పేదలకు సేవ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే అని వీహెచ్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో బీసీల భారీ బహిరంగా సభ ఉంటుందని, ఈ సభకు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు.

- Advertisement -

బీసీల స‌భ ఎప్పుడు ఉంటుంది అనేది మ‌ళ్లీ తెలియ‌జేస్తామ‌న్నారు వీహెచ్‌. ఈ సభను అందరు సక్సెస్ చేయాలని కోరారు. గట్టిగా కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, చిన్న చిన్న కోపాలు పక్కన పెట్టి క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దామ‌ని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారని, త‌న‌నే జనం బంగాళాఖాతంలో వేస్తారని ధ్వ‌జ‌మెత్తారు.  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే బాబా దేదో అని కేసీఆర్ అడుక్కునే వాడ‌ని ఎద్దేవా చేశారు.

దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది..

పప్పు అన్న త‌మ రాహుల్ పప్పా అయ్యాడు… మీ బాబై కూర్చున్నాడు.. ఈ సారి ప్రధాని రాహుల్ అవుతాడు.. లేకుంటే నా పేరు హనుమంతరావు కాదు.. అని స‌వాల్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్ర‌ధాని మోడీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, అదానికి, మోడీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ మీద కక్ష సాధింపు చర్యలు చేప‌ట్టార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌వారు అవినీతి పరులు… వాళ్లే బీజేపీలో చెరితే సత్యహరిచంద్రులు ఎట్లా అవుతున్నార‌ని మండిప‌డ్డారు.

త్వరలోనే బీసీ గర్జన పెడుతం.. దీనికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత‌ భట్టి విక్రమార్క అందరూ ఒప్పుకున్నారని వీహెచ్‌ తెలిపారు.  అగ్ర కులాలకే కాదు, రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్ ఉంటుందని,  అగ్రకులాల వాళ్లు OBCలను అనగదొక్కుతున్నారన్నారు. రాహుల్ జోడో యాత్రలో అన్ని వర్గాల వారు కలిశార‌ని, కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అంటున్నారని, ఫస్ట్ 27శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం అని స్ప‌ష్టం చేశారు.

ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం.. నేనెవ్వరికి వ్యతిరేకం కాదు మా హక్కుల కోసం మేం పోరాడుతున్నాం.. ఫైనల్ గా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మాటా వింటాను.. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పి రైతులను జైల్లో వేయిస్తున్నాడు.. పక్క రాష్ట్రాలకు వెళ్ళి సహాయం చేస్తావ్.. పార్టీలో సీనియర్లు జూనియర్ల మధ్య చిన్న చిన్న గోడవలున్నాయి. సీనియర్ మీద జూనియర్ పెత్తనం చెలాయిస్తా అంటే ఉరుకుంటారా..? అని మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీలో లొల్లి కూడా అంతేనని… ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల తరుపున నేను మాట్లాడుతా అన్నారు..

పార్టీ లోకి ఎవరైనా రానివ్వండి అలాగే పార్టీ కోసం జెండా మోసిన వారిని పార్టీ మర్చిపోదు అని వీహెచ్ హామీ ఇచ్చారు. ఈ స‌మావేశంలో వీహెచ్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్లు గాలి అనిల్ కుమార్, సంగీశెట్టి జగదీశ్, జనరల్ సెక్రటరీలు లక్ష్మణ్ యాదవ్, చేర్యాల ఆంజనేయులు, గ్రంధాలయ సంస్థ మాజీ  చైర్మన్ అనంతకిషన్, నారాయణఖేడ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర నేతలు హాజరైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement