Saturday, May 4, 2024

కృష్ణా జిల్లాలో కారు ప్ర‌మాదం.. ఫ్లై ఓవ‌ర్‌పైనుంచి పల్టీ..

హనుమాన్ జంక్షన్, (ప్రభన్యూస్) : కృష్ణ జిల్లాలో ఘోరం జ‌రిగింది. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వ‌ద్ద ఓ కారు ఫ్లై ఓవ‌ర్ మీది నుంచి కిందికి ప‌ల్టీలు కొట్టింది. అయితే కారులో ఉన్న‌వారికి ఎవ‌రికీ ప్ర‌మాదం లేదు. కాగా, వీరవల్లి జాతీయ రహదారిపై కారు ప్రమాదం జ‌ర‌గ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

విజయవాడ కంచికచర్ల నుండి ఏలూరు వైపు తల్లిదండ్రులను కలిసేందుకు కారులో వెళ్తుండగా వీరవల్లి ఫ్లైఓవర్ పై కారు బోల్తా పడి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎటువంటి ప్రాణానష్టం జరగలేదని వీరవల్లి పోలీసులు తెలిపారు. హైవే పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ప్రమాదానికి గురైనా కారును క్రేన్ సాయంతో పక్కకి తొలగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement