Saturday, May 4, 2024

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు న‌న్ను ఆహ్వానించ‌లేదు.. త‌మిళి సై

అంబేద్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు త‌న‌ను ఆహ్వానించ‌లేద‌న్నారు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. నిన్న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై హాజరుకాలేదు. ఈ సంద‌ర్భంగా
శనివారం జ‌రిగిన ఓ కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ.. తాను ఎందుకు హాజరుకాలేదనే దానికి వివరణ ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తనకు ఆహ్వానం రాలేదని అన్నారు. పిలిచి ఉంటే వెళ్లేదాన్నని చెప్పారు. అంబేద్కర్ ఎక్కువగా మహిళల గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడారని, అలాంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఒక మహిళా గవర్నర్ కి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యమని చెప్పారు. అందుకే రాజ్ భవన్ లోనే అంబేద్కర్ కు నివాళులు అర్పించానని తెలిపారు. గ్రహాల మధ్య సూర్యుడు ఉన్నట్లు.. కొంత మంది రాజకీయ నాయకులు వారి కొడుకులను మధ్యలో ఉంచాలని అనుకుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement