Friday, May 3, 2024

TS | అప్పుడేం మాట్లాడానో గుర్తులేదు.. స్పీక‌ర్ నోటుసు పంపితే స‌మాధాన‌మిస్తా: ర‌ఘునంద‌న్‌

తెలంగాణ డీజీపీ, పోలీసు వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు ఇవ్వాల (బుధ‌వారం) ఉద‌యం తీవ్ర‌ప‌ద‌జాలంతో కామెంట్స్ చేశారు. బిహార్ రౌడీయిజం ఇక్క‌డ చూపిస్తున్నార‌ని డీజీపీ అంజ‌నీకుమార్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. త‌మ‌కు హక్కులుంటాయ‌ని, వాటిని గౌర‌వించాల‌ని పోలీసుల‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. కాగా, ఈ వ్యాఖ్య‌ల‌ను ఐపీఎస్ అధికారుల సంఘం సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ విష‌యాన్ని ఖండించింది. అంతేకాకుండా స్పీక‌ర్‌కు ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావుపై ఫిర్యాదు చేసింది.

దీంతో సాయంకాల‌నికి బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు ప్లేటు పిరాయించారు. తాను ఉద్రిక్త‌ప‌రిస్థితుల్లో ఏమ‌న్నానో గుర్తు లేద‌ని మాట మార్చేశారు. ఒక‌వేళ త‌ప్పుగా మాట్లాడి ఉంటే ఆ మాట‌ల‌ను వాప‌స్ తీసుకుంటాన‌ని తెలిపారు. అంతేకాకుండా ఈ విష‌యంలో స్పీక‌ర్ నోటీసులు క‌నుక పంపితే స‌మాధానం ఇస్తాన‌ని ర‌ఘునంద‌న్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement