Monday, May 13, 2024

వైఎస్సార్ కి పులివెందుల..షర్మిలకి పాలేరు

హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలా అని తెలిపారు వైఎస్ షర్మిల. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేతలతో  లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. మరోవైపు షర్మిల పార్టీ ప్రకటనకు సంబంధించిన బహిరంగ సభకు ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సభకు పోలీసులు అనుమతినిస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల సభ నిర్వహించనున్నారు. ఈ లోగా ప్రభుత్వం కరోనా దృష్ట్యా ఏవైనా ఆంక్షలు విధిస్తే ఎలా అన్న కోణంలో నేతలు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా, సభ నిర్వహణ నేపథ్యంలో మైదానానికి అవసరమైన అనుమతి వచ్చినప్పటికీ, పోలీస్ శాఖ నుంచి మాత్రం ఇంకా అనుమతి రాలేదు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, తాము మాత్రం సభ నిర్వహించి తీరుతామని, తమను ఎవరూ ఆపలేరని షర్మిళ స్పష్టం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement