Friday, May 17, 2024

ఏపీలో మరింత పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో మళ్లీ భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 35,066 కరోనా పరీక్షలు నిర్వహించగా 585మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 128 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 99, విశాఖ జిల్లాలో 81, కృష్ణా జిల్లాలో 63, తూ.గో. జిల్లాలో 42, అనంతపురం జిల్లాలో 36, కర్నూలు జిల్లాలో 35, నెల్లూరు జిల్లాలో 23, శ్రీకాకుళం జిల్లాలో 22, ప.గో. జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 16, విజయనగరం జిల్లాలో 12, కడప జిల్లాలో 8 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 251 మంది కరోనా నుంచి కోలుకోగా గుంటూరు, కర్నూలు, చిత్తూరు, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,95,121 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,978 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 2,946గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,197గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement