Wednesday, May 8, 2024

తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా

తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అన్ని యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. పరీక్షలు అన్నీ రీ షెడ్యూల్ చేస్తామని ప్రకటించారు. కాగా నేటి నుంచి అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డ సంగతి తెలిసిందే. మంగళవారం పరీక్షలు వాయిదా వేసేది లేదని ప్రకటించగా ఇప్పుడు వాయిదా వేసినట్టు నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement