Tuesday, April 30, 2024

HYD: ప్రపంచ మధుమేహ దినోత్సవం: బాదంపప్పులతో మధుమేహానికి చెక్

హైదరాబాద్ : నవంబర్ 14, 2023న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకోనుండగా, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మధుమేహ మహమ్మారి వైపు మళ్లింది. డయాబెటిస్ క్యాపిటల్ గా భారతదేశం, ఈ సమస్యకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవం టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది మధుమేహం ఆగమనాన్ని నివారించడం లేదా ఆలస్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రీడయాబెటిస్ ను నివారించడం సాధ్యమవుతుంది.

ఈసందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి, సెలబ్రిటీ, సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ… ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని సమీపిస్తున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ తమ రక్తంలోని చక్కెర స్థాయిలపై నిఘా ఉంచాలని మాత్రమే కాకుండా వారి రోజువారీ అలవాట్లను కూడా అంచనా వేయాలని, అవసరమైన చోట మార్పులు చేయాలని తాను గట్టిగా సూచిస్తున్నానన్నారు. నియంత్రిత, పోషకమైన భోజనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు, వేయించిన పదార్ధాలకు బదులుగా కొన్ని బాదంపప్పులను ఎంచుకోవడం చాలా సులభమన్నారు. బాదంలో చాలా పోషకాలు ఉన్నాయన్నారు.

ప్రఖ్యాత ఫిట్‌నెస్ నిపుణులు యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ… ప్రీడయాబెటిస్ తరచుగా నిశ్చల జీవనశైలి, పోషకాహార లోపం వల్ల వస్తుందన్నారు. యాక్టివిటీతో పాటు, తెలివైన ఆహార ఎంపికలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పోషకాహార ప్రత్యామ్నాయాల కోసం అనారోగ్యకరమైన స్నాక్స్‌ను వదిలి, బాదంపప్పుల వంటివి తీసుకోవటం మంచిందన్నారు. ఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లోని డైటెటిక్స్ రీజనల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ… టైప్ 2 డయాబెటిస్‌తో బాధ పడుతున్న వారికి లేదా దానిని నివారించే లక్ష్యంతో వున్న వారికి, ప్రోటీన్లు, ఫైబర్, కాంప్లెక్స్ పిండి పదార్థాలను తీసుకోవడం కీలకమన్నారు. బాదం వంటి తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాన్ని భోజనంలో చేర్చుకోవడం, చక్కెర తీసుకువచ్చే చిక్కులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

- Advertisement -

న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… భారతదేశంలో ప్రీడయాబెటిస్ ప్రాబల్యం పెరుగుతోందన్నారు. ఈ సమస్యను తగ్గించడానికి లేదా ఆపడానికి మనం మెరుగైన జీవనశైలి ఎంపికలు చేసుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన భోజనంలో భాగంగా బాదంపప్పును చేర్చుకోవడం మనం చేయగల సులభమైన, రుచికరమైన మార్పు అని అన్నారు. పోషకాహార నిపుణురాలు అయిన డాక్టర్ రోహిణి పాటిల్ మాట్లాడుతూ… భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధాని అనే బిరుదును కలిగి ఉందన్నారు. దానిని పోగొట్టుకోవటానికి కొన్ని చర్యలను అమలు చేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ దిశలో ఒక సులభమైన, సమర్థవంతమైన ముందడుగు రోజువారీ బాదంపప్పులను తీసుకోవడమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement