Friday, May 3, 2024

TS: ఛ‌త్రపతి శివాజీ ఆశయాల అనుగుణంగా పని చేద్దాం…మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

మహేశ్వరం అర్బన్, ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్): ఛ‌త్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి పురస్కరించుకొని మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లేలగూడ చందన చెరువు కట్టపైన గల చత్రపతి శివాజీ విగ్రహానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చత్రపతి శివాజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్ పెట్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ యం.దుర్గా దీప్ లాల్ చౌహాన్ ,డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి ,ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి కార్పోరేటర్లు అనిల్ కుమార్ యాదవ్,రవి నాయక్,బొక్క రాజేందర్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు,డివిజన్ అధ్యక్షులు,నాయకులు సిద్ధాల బీరప్ప,సాయినాథ్ రెడ్డి,రాజ్ కుమార్,ప్రవీణ్ రెడ్డి,శిశుపాల్ రెడ్డి, కాంటేస్తేడ్ కార్పోరేటర్లు సిరూర్ బాల్ రాజ్,సునీత బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement