Sunday, May 5, 2024

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి..

న‌గ‌రంలో వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న కుషాయిగూడ‌లోని ఏఎస్ రావు న‌గ‌ర్ లో చోటుచేసుకుంది. ఈ రెండు ప్ర‌మాదాలు అతివేగం వ‌ల్లే జ‌రిగిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుషాయిగూడలో అతి వేగంగా బైక్‌పై దూసుకొచ్చిన యువకులు డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెంద‌గా, మ‌రొక‌రు గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు దవాఖానకు తరలించారు. మ‌రో ఘ‌ట‌న‌.. ఏఎస్‌ రావు నగర్ కేటీఎం బైక్‌పై అతివేగంగా వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయాలవండంతో ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ రెండు ఘటనపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement