Friday, April 26, 2024

Road Accident: టిప్పర్, బస్సు ఢీ.. 40 మంది అయ్య‌ప్ప భ‌క్తుల‌కు గాయాలు..

ప్రకాశం : రోడ్డు ప్ర‌మాదంలో 40 మంది అయ్య‌ప్ప స్వాముల‌ను గాయాలైన ఘ‌ట‌న ఒంగోలు మండలం పెళ్ళూరు వద్ద చోటుచేసుకుంది. టిప్ప‌ర్, అయ్య‌ప్ప స్వాములు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు ఢీకొట్టిన ప్రమాదంలో 40 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటన తుని నుండి శబరిమలై వెళ్తుండగా చోటు చేసుకుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement