Monday, April 29, 2024

ఆడబిడ్డల సంతోషమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం… మాడురి ప్రభాకర్ రెడ్డి

రాజేంద్రనగర్, అక్టోబర్ 6 (ప్రభ న్యూస్) : ఆడబిడ్డల సంతోషమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని శివరాంపల్లి గ్రామ శాఖ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాడూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం శివరాంపల్లి నేతాజీ యూత్ క్లబ్ ఆవరణలో బతుకమ్మ చీరలను మహిళలకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ వేడుకలను ఆనందోత్సహాల మధ్య, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలన్నారు.


తెలంగాణ ఆడపడుచులు అందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ, అనుబంధాలను గుర్తుచేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల సంతోషమే ధ్యేయంగా అద్భుతమైన పథకాలు అమలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దేవతలుగా భావించి పండుగ జరుపుకునే పండగ ప్రపంచంలోనే ఏ దేశంలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, రాజు, ప్రభాకర్, సల్మాన్, కన్యాకుమారి, మంజుల, గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement