Friday, April 26, 2024

బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలి : కుమారస్వామి

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి డిమాండ్ చేశారు. గురువారం బీసీ దళ్ ప్రధాన కార్యాలయంలో బీసీల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించాలని, అలాగే త్వరలో జనాభా గణనలు కుల గణన చేయాలని డిమాండ్ చేశారు. బీసీలలో అనేక కులాలు ,74 సంవత్సరాల నుంచి వెనక పడుతున్నాయని దానికి గల ప్రధాన కారణం రిజర్వేషన్ రాకపోవడం, కులాల వారీగా జన గణన లేకపోవడమే అని, దీనిపై జాతీయ స్థాయిలో పోరాటాలు చేసి సాధించుకోవాలని తెలియజేశారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను పోరాడి సాధించుకోవాలని, పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అని అన్నారు. త్వరలో వివిధ సమస్యలపై పటిష్టమైన కార్యాచరణతో బీసీ దళ్ ముందుకు సాగుతుందని తెలిపారు.

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ ఏ. పద్మ చారి మాట్లాడుతూ….. తెలంగాణలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాల‌ని, అలాగే బీసీ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ దళ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ డీపీ చారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఎల్డర్ కమిటీ మెంబర్ కృష్ణమూర్తి, సయ్యద్, వైస్ చైర్మన్ రాజేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement