Saturday, May 18, 2024

Hyderabad: క‌ర్మ‌న్ ఘాట్ వ‌ద్ద ఉద్రిక్తత‌

హైదరాబాద్ లోని కర్మన్‌ఘాట్ వద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. భజరంగ్ దళ్ కార్యకర్తలపై గోవులను తరలించేవారు కత్తులతో దాడికి దిగడంతో భజరంగ్‌దళ్ కార్యకర్తలతో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి గుడికి చేరుకున్నారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే వాహనంలో ఉన్న దుండగులు కొందరు కత్తులతో దాడికి దిగారు. దీంతో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆంజనేయ స్వామి గుడిలోకి పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులపై రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement