Sunday, May 5, 2024

సెర్ప్‌, మెప్మా కార్య‌క్ర‌మాల‌పై సిఎస్ స‌మీక్ష‌..

హైద‌రాబాద్ : రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటీ వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్‌ప్రైస్‌, డెవలప్‌మెంట్‌, కన్వర్‌జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు సెర్ప్‌, మెప్మా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై శుక్రవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో అధికారులతో సీఎస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకురావడానికి వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, భూసార ప‌రీక్ష‌లు, కూరగాయల సాగు, పశుసంవర్ధకం, న్యూట్రిష‌న్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, సీడీఎంఏ సత్యనారాయణ, లీడ్ ఐబీసీడీ ఎస్ఐఎస్డీ హెచ్ఆర్, భార‌త ప్ర‌భుత్వం, ఉషారాణి, హార్టీకల్చర్ డైరెక్టర్ ఎల్. వెంకట్రాం రెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ జి. లక్ష్మీబాయి, స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్‌, వీ-హ‌బ్ సీఈవో దీప్తి రేవుల, శ్రీనిధి ఎండీ జి.విద్యాసాగర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement