Sunday, April 28, 2024

HYD: దక్షిణాది ప్రేక్షకులు మరాఠీ ఐకాన్ జయవంత్ దాల్వీ ప్రతిభను గుర్తిస్తారు… గుల్కీ జోషి

హైదరాబాద్ : జీ టీవీ ఫిర్ సుబహ్ హోగీ లో ఆమె తొలిసారిగా నటించినప్పటి నుండి, గుల్కీ జోషి ఒక వైవిధ్యమైన నటిగా స్థిరపడ్డారు. మేడమ్ సర్ వంటి టెలివిజన్ హిట్స్ అయినా, భౌకాల్ వంటి వెబ్ షోలు అయినా లేదా ఆమె వరుస థియేటర్ ప్రొడక్షన్స్‌ అయినా ప్రేక్షకులను మెప్పించడంలో ఆమె ఎప్పుడూ విఫలం కాలేదు. జీ థియేటర్ టెలిప్లే కాలచక్ర లో, ఆమె తన అత్తమామలపై పగబట్టి, వారితో అసభ్యంగా ప్రవర్తించే కోడలిగా నటించింది. ప్రఖ్యాత మరాఠీ నాటక రచయిత జయవంత్ దాల్వీ రచించిన కాలచక్ర జీవిత చక్రం, వృద్ధాప్య ఇబ్బందులను ఆకట్టుకునే రీతిలో చూపుతుంది.

కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రేక్షకుల కోసం ఈ క్లాసిక్ నాటకం ఇప్పుడు కన్నడ, తెలుగులోకి అనువదించబడింది. ఈ సందర్భంగా గుల్కీ మాట్లాడుతూ… దక్షిణాది ప్రేక్షకులు ఇప్పుడు మరాఠీ దిగ్గజం జయవంత్ దాల్వీ ప్రతిభను గుర్తిస్తారని తాను ఆశిస్తున్నానన్నారు. కాలచక్ర లోని సూక్ష్మ అంశాలు ప్రతి చోటా ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తాయన్నారు. ఎందుకంటే ఈ కథ లేవనెత్తిన సమస్యలు సార్వత్రికమైనవి. తరాల వైరుధ్యాలు ప్రతిచోటా ఒకేలా ఉంటాయన్నారు. వాటిని మనం చూసే విధానం కూడా ఒకేలా ఉంటుందన్నారు. నటుడిగా గుల్కీకి థియేటర్‌తో ప్రత్యేక బంధం ఉందన్నారు. నటిగా, తన ప్రయాణం అద్భుతంగా ఉందన్నారు. తాను థియేటర్‌తో ప్రారంభించాను, ఆపై టెలివిజన్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారానన్నారు. ప్రదర్శన పరంగా థియేటర్, ఇతర మాధ్యమాల కంటే చాలా కఠినమైనదన్నారు. ఎందుకంటే మీకు ఇక్కడ రీటేక్ ఉండదన్నారు. అలాగే, మీ వాయిస్, మీ ఎక్స్‌ప్రెషన్‌లు చివరి వరుసలో ఉన్న వ్యక్తిపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. మరీ ముఖ్యంగా, ప్రేక్షకుల నుండి మీకు తక్షణ స్పందన వస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement