Sunday, April 28, 2024

ABD | నా కొడుకు మృతికి కార‌కులను అరెస్టు చేయాలి.. పీఎస్ ముందు ధర్నా

జన్నారం,(ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం వాసి తోకల రాకేష్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాల‌ని మృతుని తల్లి సరస్వతి, తమ్ముడు విశేష్ బంధువ‌ల‌తో క‌లిసి పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న చేపట్టారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ ఈఈ డివిజన్ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న తోకల రాకేష్ మృతికి.. అదే కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌లే కార‌ణ‌మ‌ని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగారు.

సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాకేష్ మృతికి కారణమైన ఇద్దరిని వెంటనే అరెస్టు చేయాలని, లేకుంటే ప‌రుగుల‌ మందు తాగి ఇక్కడే చనిపోతామ‌ని భీష్మించుకుని కూర్చున్నారు. లక్షెట్టిపేట సీఐ నరేంద్ర ఆదేశాల మేరకు లక్షెట్టిపేట, దండేపల్లి ఎస్‌ఐలు పెట్టెం చంద్రకుమార్‌, ఎన్‌.స్వరూప్‌రాజు, పోలీసులు అక్కడికి చేరుకుని మూడు రోజుల్లో ఆ నిందితులను అరెస్ట్‌ చేస్తామని హామీ వారికి న‌చ్చ జెప్పి సాయంత్రం 6.30 గంటలకు ధర్నా విరమింపజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement