Thursday, April 25, 2024

బీజేపీ కార్పొరేటర్లకు అవమానం

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో బోడుప్పల్ బీజేపీ కార్పొరేటర్లకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ కార్పొరేటర్లకు కనీసం స్టేజీపైన కూర్చునే అవకాశం కూడా కల్పించలేదని 19వ డివిజన్ కార్పొరేటర్ సామల పవన్ కుమార్ రెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బోడుప్పల్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో బీజేపీ కార్పొరేటర్లకు కనీసం స్టేజ్ పైన కుర్చీలు కూడా వేయకుండా తమను అవమానించారని, తాము స్టేజ్ పైన కాకుండా పక్కకు నిలబడాల్సి వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వ ధనంతో జరుగుతున్న స్వచ్ఛ వాహనాల అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో ఓపికతో ఉన్నామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ డబ్బుతో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement