Monday, April 29, 2024

Hyd: రాహుల్ పై కక్ష్యసాధింపునకు నిరనసగా.. సత్యాగ్రహ మౌనదీక్ష

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కక్ష్యసాధింపునకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ లో సత్యాగ్రహ మౌనదీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై రాజకీయ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అందుకు నిరసనగా సత్యాగ్రహ మౌన దీక్ష కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సత్యాగ్రహ మౌనదీక్షలో కాంగ్రెస్ నాయకులు జైపాల్, పోచయ్య, సూర్య రాథోడ్, రాము, కొండ, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement