Sunday, April 28, 2024

SAMSUNG: గెలాక్సీ ఏ34 5జి పై అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించిన శాంసంగ్

హైద‌రాబాద్ : భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జి ( గెలాక్సీ ఏ34 5జీ) స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. గెలాక్సీ ఏ 34 5జి శాంసంగ్ సిగ్నేచర్ గెలాక్సీ డిజైన్, నైటోగ్రఫీ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లతో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. ఇది వినియోగదారులు తక్కువ కాంతి పరిస్థితులలో సైతం షార్ప్ చిత్రాలు, వీడియోలను షూట్ చేయడంలో సహాయపడుతుంది. తమ శ్రేణిలో అత్యుత్తమమైన ఐపి 67 రేటింగ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 4 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 5 సెక్యూరిటీ అప్‌డేట్‌లతో, గెలాక్సీ ఏ 34 5జి ఆందోళన-రహిత వినియోగదారు అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది.

ప్రత్యేక ఆఫర్‌గా వినియోగదారులు ఇప్పుడు రూ. 3000 తక్షణ తగ్గింపుతో గెలాక్సీ ఏ34 5జి ని కొనుగోలు చేయవచ్చు. 8జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్‌కు అసలు ప్రారంభ ధర రూ. 27,499 కాగా, వినియోగదారులు ఇప్పుడు గెలాక్సీ ఏ34 5జి ని కేవలం రూ.24,499కి, 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్‌ ను రూ.26499 వద్ద సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ ఏ 34 5జి ఒక ఫ్లోటింగ్ కెమెరా సెటప్‌తో పాటు పరికరం రంగుకు సరిపోయే మెటల్ కెమెరా డెకోను కలిగి ఉంది. ఇది నాలుగు అధునాతన రంగులలో లభిస్తుంది. గెలాక్సీ ఏ 34 5జి 48ఎంపీ ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 5ఎంపీ మాక్రో లెన్స్‌తో వస్తుంది. గెలాక్సీ ఏ 34 5జి సామ్‌సంగ్ డిఫెన్స్-గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ నాక్స్‌తో వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement