హైదరాబాద్ : భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ అత్యుత్తమ సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో గెలాక్సీ ఎం55 5జి అండ్ గెలాక్సీ ఎం 15 5జి అనే రెండు మాన్స్టర్ పరికరాలను విడుదల చేసినట్లు ప్రకటించింది. అత్యంత ప్రజాదరణ పొందిన గెలాక్సీ ఎం సిరీస్కి తాజా జోడింపులుగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్స్ లో సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, మాన్స్టర్ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్లతో వినియోగదారులకు అత్యుత్తమ స్మార్ట్ఫోన్ అనుభవాన్ని అందిస్తాయి.
ఈసందర్భంగా శాంసంగ్ ఇండియా ఎంఎక్స్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ మాట్లాడుతూ… శాంసంగ్ సిద్దాంతానికి అనుగుణంగా తాము కొత్త గెలాక్సీ ఎం55 5జి అండ్ గెలాక్సీ ఎం 15 5జి తో ఆవిష్కరణల సరిహద్దులను ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. ఇవి యువ ఎంజెడ్ వినియోగదారుల అనంతమైన అభిరుచులను శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉన్న రెండు అద్భుతమైన పరికరాలు అన్నారు. సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, ఆకర్షణీయమైన, సొగసైన డిజైన్, శక్తివంతమైన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, నాలుగు తరాల ఓఎస్ అప్గ్రేడ్లు, ఐదు సంవత్సరాల భద్రతా అప్డేట్ల సాటిలేని వాగ్దానంతో సహా బహుళ సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో తాము గెలాక్సీ ఎం55 5జి అండ్ గెలాక్సీ ఎం 15 5జితో మాన్స్టర్ వినియోగదారు అనుభవాన్ని అందిస్తున్నామన్నారు.