Thursday, April 25, 2024

సూపర్‌ఫుడ్‌ బ్రాండ్‌ నరిష్‌ యు లో పెట్టుబడులు పెట్టిన సమంత

క్వినోవా, చియాను భారతదేశానికి తీసుకువచ్చిన తొలిబ్రాండ్‌ కావడంతో పాటుగా దేశీయంగా అభివృద్ధి చెందిన సూపర్‌ఫుడ్‌ స్టార్టప్‌, నరిష్‌ యు తమ కంపెనీలో సుప్రసిద్ధ నటి సమంత రుత్‌ ప్రభు పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. నరిష్‌ యులో పెట్టుబడులు గురించి సమంత్‌ రుత్‌ ప్రభు మాట్లాడుతూ… గత కొద్ది కాలంగా నరిష్‌ యు ఉత్పత్తులను తింటుండటం వల్ల ఆ సంస్ధలో పెట్టుబడులు సహజంగానే జరిగాయన్నారు. క్వినోవా, చియా సీడ్స్‌ వంటి సూపర్‌ ఫుడ్స్‌ను ఇండియాకు తీసుకురావడంలో వారు పోషించిన పాత్ర, స్థానికంగా వారు ఎదిగిన తీరు, తృణధాన్యాల ఆధారిత క్లీన్‌ లేబుల్‌ వీగన్‌ సూపర్‌ఫుడ్స్‌ కోసం వారి ప్రొడక్ట్‌ రోడ్‌మ్యాప్‌ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు.

వినియోగదారుల ఆరోగ్యంతో పాటుగా భూమ్మీద కూడా సానుకూల ప్రభావం తీసుకువచ్చేలా విలువను నరిష్‌ యు సృష్టించనుందని తాను నమ్ముతున్నానన్నారు. వ్యాపారం పట్ల వారి వినూత్నమైన, స్ధిరమైన విధానంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపారు. నరిష్‌ యు కో–ఫౌండర్‌ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ… నరిష్‌ యు కుటుంబంలోకి సమంతను ఆహ్వానిస్తున్నామన్నారు. పూర్వకాలపు ఆహారపద్ధతుల పట్ల ఆమె ఆలోచనలు తమ ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ తాము అభివృద్ధి చేసిన ఉత్పత్తులు, అవి సాధించిన విజయానికి ప్రతీకగా ఆమె పెట్టుబడులు నిలుస్తాయన్నారు. సమంతతో భాగస్వామ్యంతో మార్కెట్‌లో తమ స్ధానం మరింతగా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నామన్నారు. నరిష్‌ యు కో –ఫౌండర్‌ సౌమ్య రెడ్డి మాట్లాడుతూ… తాను పుట్టినప్పటి నుంచే లాక్టోస్‌ ఉత్పత్తులను తట్టుకోలేని తత్త్వం తన శరీరానిదన్నారు. తమ అమ్మ తనకు ఆ తరహా కనుగొనడానికి తీవ్రంగా సతమతమయ్యేవారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement