Saturday, April 20, 2024

శ్రీ కోదండ రామాలయానికి విరాళాలు అందచేత

బీర్కుర్ : బీర్కుర్ మండల కేంద్రంలో శ్రీ కోదండ రామాలయంనికి పలువురు విరాళాలు అందచేశారు. అందులో భాగంగా బీర్కుర్ గ్రామానికి చెందిన నార్ల భరత్ రాజ్ గుప్తా దoపతులకు చెందిన కుమార్తె, అల్లుడు ఎన్నారైలు స్వప్న-శ్రీకర్ లు స్థానిక శ్రీరామాలయనికి రూ.1.61 లక్షల విలువైన రెండు కిలోల వెండి కిరీటాలను బహుకరించారు. అనంతరం బీర్కూర్ కు చెందిన కర్ణకంటి వీరయ్య గుప్తా దoపతులు రూ.18 వేల విలువ గల బంగారం బొట్టు, 8 నేత్రాలు, 4 నామాలు, బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన ఒక్నూర్ కార్తీక్ రూ.11 వేలు విరాళంగా అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, లాడెగమ గంగాధర్, మేకల విఠల్, కొట్టూరి ప్రవీణ్ సేట్, వీరయ్య సేట్, యాట వీరేశం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement