Friday, May 3, 2024

Follow up | డాక్యుమెంట్స్‌ డెలివరీ పేరుతో డ్రగ్స్‌ విక్రయం.. ఐదుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్‌ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులకు అందిన సమాచారంతో ఐదుగురు వ్యక్తులను మంగళవారం పట్టుకున్నారు. వీరంతా డాక్యుమెంట్స్‌ డెలివరీ అంటూ ఎన్వలప్‌ కవర్‌లో హెరాయిన్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన బజ్‌రంగ్‌ బిషోని ఇతర ప్రాంతాల నుంచి హెరాయిన్‌ కొనుగోలు చేసి.. మహేందర్‌ బిషోని, అభిషేక్‌ బిషోని, ఫక్‌రాజ్‌ బిషోని, సిసుపాల్‌ బిషోని అనే వ్యక్తుల ద్వారా ఇతరులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

వీరంతా హైదరాబాద్‌లో పలువురికి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న రాచకొండ ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ- పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.12 లక్షలు విలువ చేసే హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌ నుంచి ప్రైవేట్‌ బస్సులో తీసుకువచ్చి వాటిని రాపిడోతో పాటు- పలు ట్రావెలింగ్‌ బాయ్స్‌ ద్వారా కవర్‌లో పెట్టి డాక్యుమెంట్స్‌ డెలివరీ చేయాలని వాటిని మత్తు బాబులకు అందిస్తున్నారు. మరికొందరికి నేరుగా విక్రయిస్తున్నారు. వీరిని కుషాయిగూడ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement