Tuesday, April 30, 2024

జ‌ల‌మండ‌లి ఉద్యోగుల‌కు పీఆర్సీ అమ‌లు

జ‌ల‌మండ‌లి ఉద్యోగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నుండి తీపి క‌బురందింది. బోర్డులో ప‌ని చేస్తున్న‌ ఉద్యోగులంద‌రికీ పీఆర్సీ అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది. ఈ నెల నుంచే జ‌ల‌మండ‌లి ఉద్యోగులకు పీఆర్సీ అమ‌లు కానుంది. న‌వంబ‌రు నుంచే పెంచిన వేత‌నాల‌ను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమకు పీఆర్సీ ఇవ్వాలని జలమండలి ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ డిమాండ్‌పై జలమండలి ఉద్యోగులు గత నెలాఖరులో ఖైరతాబాద్ జలమండలి ఎదుట నిరసన చేపట్టారు. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో దాదాపు 4వేల మంది జ‌ల‌మండ‌లి ఉద్యోగుల‌కు వేత‌నం పెర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement