Friday, April 26, 2024

ప్రజా సమస్యలు..

కవాడిగూడ : కవాడిగూడ మున్సిపల్‌ డివిజన్‌లోని పలు బస్తీలలో ఉన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డివిజన్‌ కార్పొరేటర్‌ జి రచనశ్రీ కోరారు. డివిజన్‌లోని దోమలగూడ హిందు స్మశానవాటిక, మున్సిపల్‌ పార్కు, తదితర బస్తీలలో ప్రజా సమస్యలను సమీక్షించారు. ఈ సందర్బంగా రచనశ్రీ మాట్లాడుతూ ఆయా ప్రాంతాలలో డ్రైనేజీ నూతన పైపులైన్ల ఏర్పాటు, పార్కు సుందరీకరణ, మరుగుదోడ్ల నిర్మాణం, జిమ్‌ ఏర్పాటు, నాలా ప్రహారిగోడ పనులు చేపట్టాలని మున్సపల్‌ అధికారులను కోరారు. అభివృద్ది పనులు చేపట్టకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే పనులు చేప ట్టి పూర్తి చేయాలని ఆమె సూచించారు. అదే విధంగా డ్రైనేజి, రోడ్లు తదితర పనులు కూడా చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజె పి నేతలు పరిమళ్‌కుమార్‌, జి వెంకటేష్‌, మహేందర్‌బాబు, కె అంజనేయులు, ప్రభాకర్‌, శంకర్‌లాల్‌, పరశురాం, విష్ణు, రమేష్‌యాదవ్‌, దిలీప్‌ యాదవ్‌, శివరాజ్‌, జిహెచ్‌ఎంసి అధికారులు డిఈ సన్నీ, ఏఈ గౌతం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement