Wednesday, April 24, 2024

తప్పూ ఒప్పులు లేవు…అధికారం మాత్రమే శాశ్వతం – రిపబ్లిక్ లో రమ్యకృష్ణ

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో మంచి సక్సెస్ ని అందుకొని జోష్ లో ఉన్నాడు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ . ప్రస్తుతం దేవకట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ రిపబ్లిక్ చిత్రం నుంచి నటి రమ్యకృష్ణ లుక్‌ని విడుదల చేశారు. తప్పు ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం…. అని భావించే పవర్‌ ఫుట్‌ రాజకీయ నాయకురాలి పాత్రలో విశాఖ వాణిగా రమ్యకృష్ణ ఈ చిత్రంలో కనిపించబోతోంది.

ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ ఈ సినిమాలో కనిపించనుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. కాగా ఐశ్వ‌ర్యా రాజేశ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీలక పాత్రలో న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement