Tuesday, April 30, 2024

HYD: బైక్ చోరీల‌కు పాల్ప‌డిన ఇద్ద‌రు అరెస్టు

బైక్ చోరీల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రినీ గుడిమ‌ల్కాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి 5ద్విచ‌క్ర వాహ‌నాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు త‌ర‌లించారు.

గుడిమ‌ల్కాపూర్ ఎస్‌హెచ్‌వో ముజీబ్ ఉర్ ర‌హ‌మాన్ తెలిపిన వివ‌రాల ప్ర‌కాం.. సౌత్ వెస్ట్ జోన్‌ అడిష‌న‌ల్ ఎస్పీ, ఎసీపీ కుల్సుంపుర ఆధ్వ‌ర్యంలో ఎస్‌హెచ్‌వో గుడి మ‌ల్కాపూర్‌, క్రైం ఎస్ఐ గోపిలు గుడిమ‌ల్కాపూర్‌లో బైక్ చోరీల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌హ్మ‌ద్ జావేద్‌, స‌ల్మాన్ స‌య్య‌ద్ అదుపులోకి తీసుకొని విచారించారు. విచార‌ణ‌లో దొంగ‌లించిన 5ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్ చేసి చంచ‌ల్‌గూడ్ జైలుకు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement