తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటారు. ప్రకృతి, సమాజ హితం కోసం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ యజ్ఞంలో ప్రజలు ఉద్యమంలా పాల్గొనాలన్నారు. చిన్నవారైనా పెద్దవారైనా అందరూ తమ జన్మదినం సందర్భంగా మొక్కలను నాటి కాపాడుకోవాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..