Tuesday, April 30, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన శాస‌న‌స‌భాప‌తి పోచారం

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటారు. ప్రకృతి, సమాజ హితం కోసం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమ‌న్నారు. ఈ యజ్ఞంలో ప్రజలు ఉద్యమంలా పాల్గొనాల‌న్నారు. చిన్నవారైనా పెద్దవారైనా అందరూ తమ జన్మదినం సందర్భంగా మొక్కలను నాటి కాపాడుకోవాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement